SEA MAFIA: సముద్రాన్ని కూడా వదలరా..? భయపెడుతున్న కొత్త మాఫియా?
మట్టిని.. రాళ్లను, నదీ ఇసుకను దేన్నీ వదలడం లేదు మాఫియా రాయుళ్లు.. ఇప్పుడు సముద్రు ఇసుకను సైతం వదలడం లేదు.. ఎందుకో తెలుసా?
అలా సరిహద్దులు దాటించిన ఇసుక రాయుళ్లు పోలీసుల కళ్లు కప్పుతూ.. వాహనాలను మార్చి పొరుగు రాష్ట్రాలకు నల్ల ఇసుకను తరలించేస్తున్నారు. ఇటీవల పోలీసులకు సమాచారం రావడంతో వారు దాడులు చేసి లారీని సీజ్ చేసి కేసు నమోదు చేశారు. అలాగే ఇటీవల భీమిలి మండలం అన్నవరం సముద్ర తీరం నుంచి భోగాపురం మండలం బసవపాలెం మీదుగా నల్ల ఇసుకతో తరలిపోతున్న లారీని పట్టుకున్నారు.
సాధారణంగా ఇసుకను ఇండ్లు, భారీ భవనాల నిర్మాణాలకే వాడుతారు. అయితే వాటి కూడా నదుల దగ్గర దొరికే ఇసుక.. పెద్ద పెద్ద వాగుల్లో దొరికే ఇసుకను మాత్రమే వాడుతారు.. అయితే సాధారణంగా సముద్రం లేదా ఎడారి ఇసుకను ఉపయోగించరు.. ఎందుకంటే..? ఈ ఇసుక ప్రకాశంగా, మెరుస్తూ కనిపిస్తుంది, అంతేకాదు ఇవి చాలా మేలిమిగా, గుండ్రంగా ఉంటాయి. ఈ రకమైన ఇసుకను ఉపయోగించడంతో స్ట్రక్చర్ బలహీనపడుతుంది. పైగా, సముద్రపు ఇసుకలో ఉప్పు ఉంటుంది. దీని కారణంగా స్టీల్, ప్లాస్టర్కి మంచిది కాదు. దీర్ఘ కాలంలో ఈ ఇసుకను ఉపయోగించడం కారణంగా ఇనుము తప్పు పడుతుంది. ఇంటి మన్నిక, దృఢత్వంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. అయినా మరి ఈ నల్ల ఇసుకను ఎందుకు అక్రమ రవాణా చేస్తున్నారని డౌట్ పడుతున్నారా..?
ఈ నల్ల ఇసుక ప్రయోజనం ఏంటంటే..? సముద్రపు నల్ల ఇసుక అద్దాలు, స్మార్ట్ఫోన్ తెరలు, ఫోన్లు, కంప్యూటర్లోని సిలికాన్ చిప్లు, క్వార్ట్జ్, అత్యాధునిక పరికరాల తయారీకి ఉపమోగిస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ ఇసుక అధిక ధర పలుకుతుండడంతో ఇసుక దొంగలు రెచ్చిపోతున్నారు. స్థానికుల నుంచి సమాచారం వచ్చినప్పుడు వాహనాలను పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నామన్నారు. సముద్రపు ఇసుక తరలిస్తున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
Comments
Post a Comment